ఏపీకి మూడు రాజధానులపై కేటీఆర్ కామెంట్స్

ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన, ఏపీకి మూడు రాజధానులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఆదివారం కేటీఆర్ #AskKTR పేరిట ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలనపై మీరేమంటారని ఓ నెటిజన్ అడగ్గా.. బాగానే ప్రారంభించాడని అనుకుంటున్నానని కేటీఆర్ సమాధానమిచ్చారు.

మీరు తెలంగాణ వ్యక్తి అని మర్చిపోయి.. భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి ? అంతేకాకుండా హైకోర్టు లేదా రాజధాని అంటేనే అభివృద్ధా అంటూ ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించగా.. అది నిర్ణయించేది తాను కాదని.. ఏపీ ప్రజలని ఆయన మంత్రి కేటీఆర్ తెలివిగా సమాధానం ఇచ్చారు.