రస్మికని ఏడిపించిన పోస్టు

ఓ ట్విట్టర్ పోస్ట్ హీరోయిన్ రష్మికని ఏడిపించింది. ఆ పోస్టర్ ని చూసి రస్మిక కన్నీళ్లు పెట్టుకొంది. కాకపోతే అవి ఆనంద బాష్పాలు. నటిగా నేటితో రస్మిక మూడేళ్లు పూర్తి చేసుకొంది. కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ తో రష్మిక కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. 2016 డిసెంబర్  30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. రష్మిక సినిమాల్లోకి వచ్చి నేటితో మూడేళ్లు అయిన సందర్భంగా నెటిజన్లు, అభిమానులు “3ఇయర్స్ ఆఫ్ రష్మిక ఇన్ సినిమా” అనే పేరుతో కామన్ డీపీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కామన్ డీపీపై రస్మిక స్పందించారు.

“ఈరోజు నా ఉదయం వీటితోనే ప్రారంభమైంది. వీటిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి. ఎంతో ఎమోషనల్ అయ్యాను. కష్టానికి ప్రతిఫలమిది. మీకు మరిన్ని మంచి చిత్రాలను అందించడానికి మరింత కష్టపడతాను. ఐ లవ్ యూ” అంటూ ఎమోషనల్ అయింది.  కిర్రాక్ పార్టీ సినిమా తర్వాత రష్మిక పలు కన్నడ, తమిళ చిత్రాలతోపాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో ఛలో, గీత గోవిందం విజయాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రస్మిక ‘సరిలేరు నీకెవ్వరు’, భీష్మ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.