బాలీవుడ్ హీరోయిన్’ని అవమానించిన సౌత్‌ స్టార్ హీరో.. ఎవరు ?

టాలీవుడ్ లో హీరోలదే డ్యామినేషన్. తెరమీద, తెర వెనక కూడా హీరోకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని చెబుతుంటారు. దీనిపై సీనియర్ హీరోయిన్స్ ఒకరిద్దరు పెదవి విరిచిన సందర్భాలున్నాయి. ఇక తెలుగు సినిమాల్లో నటించిన బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతల తీరుపై సంచలన కామెంట్స్ చేసిన సందర్భాలని చూశాం. తాజాగా బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ నటించిన నేహా ధుపియా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు.

‘చాలా ఏళ్ల క్రితం నేను దక్షిణాది సినిమా చేస్తున్నప్పుడు.. నిర్మాతలు ముందు హీరోకే భోజనం ఏర్పాటు చేసేవారు. ఓసారి నేను చాలా ఆకలితో ఉన్నా. హీరో షాట్‌లో ఉన్నారని, కాబట్టి ముందు ఆయనే తినాలని అన్నారు. ఇలాంటి వికారమైన సంఘటనలు కూడా జరిగాయి. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. ఇలాంటివి అస్సలు ఎప్పుడు జరగకూడదు. సెట్‌లో ఒక్కరోజు మాత్రమే నాకు ఈ పరిస్థితి ఎదురైంది. అది చూసి నేను నవ్వుకున్నా.. నన్ను ఇది ఏ మాత్రం బాధించలేదు’ అని నేహా తెలిపారు.

తరుణ్‌, శ్రీదేవి, అనిత ప్రధాన తారాగణంగా రూపొందిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో నేహా అతిథి పాత్రలో కనిపించారు. ‘విలన్‌’, ‘పరమ వీరచక్ర’ సినిమాల్లో కథానాయికగా అలరించారు. ఈ నేపథ్యంలో నేహాకి అవమానం జరిగిన సినిమా స్టార్ హీరో నటించిందని తెలుస్తోంది. నేహా ధుపియా ప్రస్తుతం సెలబ్రిటీ ఛాట్‌ షోతో బిజీగా ఉన్నారు.