అలీని పరామర్శించిన తలసాని 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీని పరామర్శించారు. సోమవారం మణికొండలోని అలీ ఇంటికి వెళ్లిన తలసాని ఆయన పరామర్శించారు. ఇటీవలే అలీ తల్లి అనారోగ్య కారణాల వలన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అలీ ని పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఇక బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమైన అలీ.. టాప్ కమెడియన్ గా ఎదిగారు.  వలం నటుడిగానే కాక తన తోటివారికి ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు, ముందుకు వచ్చి వీలైనంత సాయం అందించే ఆలీ అంటే ఇండస్ట్రీలో అందరూ ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలీ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో మంచి రేటింగ్ తో రన్ అవుతోంది.