ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం

ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించిండి. ఈ ఉదయం పీరాగర్హీలోని ఓ బ్యాటరీ ఫ్యాకర్టీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీలు లీక్‌ అవ్వడంతో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. 35 ఫైర్ ఇంజన్లు మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దాదాపు 14మంది తీవ్రంగా గాయపడ్డారు. 13మంది ఫైర్ ఇంజన్ సిబ్బందికి గాయలైనట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల ఢిల్లీ ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరవక ముందే ఢిల్లీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు భయాంధోళనకి గురవుతున్నారు.