విడిగా ఉంటున్న దీపిక-రణ్ వీర్ !

బాలీవుడ్ లో పుకార్లకి కొదవుండదు. పెళ్లైన మరునాడే విడిపోయారనే ప్రచారం కూడా చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ దంపతులు దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ లు విడిగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే, ఇది ప్రచారం కాదు. నిజం. స్వయంగా రణ్ వీర్ సింగ్ నే చెప్పిన నిజం.

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పదేళ్ల కిందట దీపిక సొంతంగా ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దీపిక కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్‌లో ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్నారట. తాజాగా రణ్‌వీర్ కూడా అదే అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో అద్దెకు దిగాడట. దీని అద్దె నెలకు 7.25 లక్షల రూపాయలట.

ఫ్లాట్ రెంట్ సంగతి పక్కనపెడితే..  ఒకే అపార్ట్‌మెంట్‌లో భార్య, భర్త ఇలా విడివిడిగా వేర్వేరు ఫ్లాట్‌లలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య ఏమైన గొడవలు జరిగాయా ? అనుమానులు కలుగుతున్నాయి. అలాంటి అనుమానాలు అవసరం లేదేమో. ఎందుకంటే.. ? దీపిక సమయం వచ్చినప్పుడల్లా.. తన భర్తపైఉన్న ప్రేమని భయపెడుతోంది. రణ్ వీర్ అంతే. ఈ జంట ఇటీవల ప్రథమ వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే.