..పాడు చేశారంటూ.. పోలీసులని ఆశ్రయించిన శ్రీరెడ్డి !


వివాదాస్పద నటి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. తన కారుని పాడు చేశారంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఒకరిపై అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ? ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో మకాం పెట్టిన సంగతి తెలిసిందే. అన్భునగర్‌లోని ఒక ప్లాట్‌లో నివాసం ఉంటుంది. ఐతే, ఇటీవల శ్రీరెడ్డి ఆడి కారుపై ఎవరో గీతలు గీశారట. దీనిపై తాజాగా శ్రీరెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. ఈ పని ఓ దర్శకుడు చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెఌతే.. శ్రీరెడ్డి నివాసం ఉంటున్న ప్లాట్ కి సమీపంలోనే విశ్రాంత పోలీస్ అధికారి బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో గత కొన్నాళ్లుగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వాహనాన్ని శ్రీరెడ్ది ప్లాట్ ఎదురుగా పార్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ వాహనాన్ని తీసేయమని శ్రీరెడ్డి చెప్పిందట. ఆ తర్వాత శ్రీరెడ్డి ఆడి కారుకి గీతలు పడ్డాయి. ఇది ఆ చిత్రబృందం చేసిన పనే.. బహుశా.. ఆ సినిమా దర్శకుడి చేసి ఉంటాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది శ్రీరెడ్ది. దీంతో.. శ్రీరెడ్డి కారుని పాడుచేశారనే న్యూస్ చెన్నైలో వైరల్ అవుతోంది.