విజయ్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా ?

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ఇప్పటికే బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన ‘రౌడీ’ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం అది బాగానే నడుస్తోంది. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో విజయ్ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి లాభాలని తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్ కొత్త బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి ‘ఏఎంబీ’ని నిర్మించిన సంగతి తెలిసిందే. మహేష్ బాటలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ ని నిర్మించే పనుల్లో ఉన్నారు. ఇప్పుడు విజయ్ కూడా  మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఈ వ్యాపారాన్ని నిర్వహించబోతున్నాడు. ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో తొలి మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నాడు.