హైదరాబాద్’లో రజనీ సందడి !

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘దర్భార్’. నయనతార కథానాయిక.బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రతినాయకుడుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈ సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రజనీతో పాటు దర్భార్ చిత్రబృందం హాజరుకానుంది.

ఇక సంక్రాంతి పోరులో నాలుగు సినిమాలు నిలవనున్నాయి. ఈ నెల 9న రజనీ దర్భార్, 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల.. వైకుంఠపురంలో, 15న ఎంతమంచివాడవురా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు సినిమాలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచేశాయి. ఇప్పటికే సరిలేరు సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. మరీ.. ఈ నాలుగు సినిమాల్లో అసలు సిసలు సంక్రాంతి పుంజుగా ఎవరు నిలుస్తారన్నది చూడాలి.