శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి !

ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకిదూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సహాయంతో పోలీసులు కారుని.. అందులోని మృతదేహాలని బయటికి తీశారు. ఈ ఘటనతో జిల్లాలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం అతి వేగమా.. ? లేక సడెన్ కారు బ్రేకులు పని చేయలేకపోవడమా ? అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.