మంత్రులకి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్


తెలంగాణ మంత్రులకి మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుంది. ఈ ఎన్నికల పుణ్యమా అని మంత్రి పదవులు ఊడిపోయే పరిస్థితి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులకి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని సీఎం కేసీఆర్ అన్నారు. మనకు ఎవరితోనూ పోటీ లేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. పాత, కొత్త నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి.  నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ తో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట మంత్రులు ప్రచారం చేస్తారని తెలిపారు. ఐతే, గెలుపు భారమంతా సీఎం కేసీఆర్ మంత్రులపైనే పెట్టడం విశేషం.