భువనగిరి కాంగ్రెస్’లో విబేధాలు

మున్సిపల్ ఎన్నికల తర్వాత టీ-పీసీసీ మార్పు ఉండనుంది. తెలంగాణ కొత్త పీసీసీ చీప్ రేసులో ఉన్నాడు భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మున్సిపల్ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భువనగిరి పరిధిలో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

జనగామ, యాదాద్రి జిల్లాల నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడటంతో ఇరువర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సమావేశం నుంచి జనగామ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ముందే ఈ గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సహజమే. కానీ, కొత్త పీసీసీ చీఫ్ కి పోటీపడుతున్న కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ముందే.. ఈ తతంగం నడవడం ఆయనకి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే.