తనుశ్రీ లాయర్ కూడా కామాంధుడేనట !

బాలీవుడ్ లో #మీటూ ఉద్యమంలో పాల్గొన్న తొలి హీరోయిన్ తను శ్రీ దత్తా. ఆమె సీనియర్ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద సంచలనానికి దారి తీశాయి. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని తనుశ్రీనపై నానా పటేకర్ కూడా కేసు వేశారు. ఈ కేసును వాదించడానికి నితిన్ సత్పుటే అనే లాయర్‌ని తనుశ్రీ నియమించుకుంది.

ఇప్పుడీ లాయర్ గురించి ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్‌పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్‌.. ప్రతర్థి మహిళా లాయర్‌ను కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయమూర్తి కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్త లాయర్ కూడా అలాంటోడని తేలింది. మరీ.. ఇప్పుడు తనుశ్రీ ఆ లాయర్ పై కూడా పోరాడుతుందేమో చూడాలి.