బీజేపీలోకి జేసీ జంప్

తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ని కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. భేటీ అనంతరం జేసీ మాటలు కూడా ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ ఉన్నట్టు అర్థమవుతోంది. మర్యాదపూర్వకంగానే సత్యకుమార్ ని కలిశాను. దీని వెనక ఎలాంటి రాజకీయకోణం లేదన్నారు జేసీ. 

అదేసమయంలో.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని జేసీ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో కలిపితే కచ్చితంగా బీజేపీలో చేరుతానన్నారు. ఈ వ్యాఖ్యలని బట్టీ జేసీ బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తెదేపా కీలక నేతలు పక్క పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేసీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది.