మహేష్ పైసా పారితోషికం తీసుకోలేదట

సూపర్ స్టార్ మహేష్ బాబు మిగితా హీరోలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు పైసా పారితోషికం తీసుకోలేదట. ఈ విషయాన్ని ఆదివారం జరిగిన సరిలేరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టారు. 

సరిలేరు కోసం మహేష్ ఇప్పటి వరకు ఒక్క పైసా తీసుకోలేదట. ఇది మంచి పరిణామం. దాని వలన నిర్మాతని వడ్డీ మిగులుతుంది. రామ్ చరణ్ కూడా ఇలాగే చేస్తున్నారు అన్నారు. మెగాస్టార్ కి అసలు విషయం తెలుసో లేదో కానీ.. మహేష్ పారితోషికం తీసుకోవడం మానేసి చాన్నాళ్లయింది. ఆయన పారితోషికం బదులుగా నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకుంటున్నారు. దాని వలన మహేష్ రూ. 50కోట్లకి పైగానే ముట్టుతుందట. అందుకే సినిమా చేసేటప్పుడు పైసా తీసుకోవడం లేదు.

ఇక మహేష్ ని చూస్తే ముద్దొస్తుంటుంది. బిడ్డలా అనిపిస్తాడు. ఎప్పుడూ మొహంపై చిరు నవ్వు కనిపిస్తుంది. దాని వెనక చిలిపితనం కూడా ఉంటుంది. దొంగ.. అంటూ మహేష్ గురించి ఆసక్తికర మాటలు చెప్పారు మెగాస్టార్. అంతకుముందు మాట్లాడిన మహేష్ మెగాస్టార్ కి కృతజ్ఝతలు తెలిపారు. పిలవగానే ఫంక్షన్ కి వచ్చినందుకు హ్యాపిగా ఉందన్నారు.