విజయశాంతిని పబ్లిక్’గా నిలదీసిన చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని పబ్లిక్ గా నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. ఆదివారం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సరిలేరు ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేదికపై చిరు-విజయశాంతి ముచ్చట్లు ఫుల్లుగా నవ్వించేశాయి. స్టేజ్ పై మెగాస్టార్ వన్ మేన్ షో చేశారు. విజయశాంతితో ఓ ఆటాడుకొన్నాడు. చిరంజీవి-విజయశాంతిలది హిట్ కాంబో. వీరి కలయికలో దాదాపు 20 సినిమాలొచ్చాయ్. విజయశాంతి కెరీర్ లోనే చిరుతో ఎక్కువ సినిమాలు చేసింది. గతంలో వీరిద్దరు మంచి స్నేహితులు. టీ-నగర్ లో ఎదురెదురుగా ఇళ్లు ఉండేవి. ఐతే, రాజకీయాల్లోకి వెళ్లాక.. విజయశాంతి మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్ లో విమర్శించిన సంగతి తెలిసిందే.

అసలు తనపై ఎలా విమర్శలు చేయాలనిపించిందని.. సరిలేరు ప్రీ రిలీజ్ వేదికపైనే చిరు విజయశాంతిని నిలదీశారు. కాదు.. కడిగేశాడు. దానికి.. విజయశాంతి స్నేహం వేరు, రాజకీయాలు వేరని సమాధానిమిచ్చింది. మీరు నా హీరో అంటూ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చిరు-విజయశాంతి స్నేహితులైపోయారు. మొత్తానికి.. సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చిరు-విజయశాంతిలని తిరిగి ఒక్కటి చేసింది.