మంచివాడి కోసం తారక్ వస్తున్నాడు

సంక్రాంతి సినిమాలు ప్రమోషన్స్ జోరు చూపిస్తున్నాయ్. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకొంటున్నాయి. ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్, సూపర్ స్టార్ లని ఒకే వేదికపై చూడాలనే ఆసక్తిని అభిమానులున్నారు.

ఇక రేపు (జనవరి 6) ‘అల.. వైకుంఠపురంలో’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. గెస్ట్ గా ఎవరు వద్దని బన్నీ సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ? మెగాస్టార్ ని మించిన గెస్ట్ ఉండరన్నది బన్నీ అభిప్రాయమట. 

ఈ నెల 8న కల్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ ప్రీ రిలీజ్ వేడుక జరనుంది. ఈ వేడుకకి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ వేడుకకి బాలయ్య కూడా వస్తారని నందమూరి అభిమానులు ఆశపడ్డారు. కానీ, బాలయ్య రాక గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేటు లేదు. దీంతో.. ఆయన రావట్లేదని తేలిపోయింది.