సరిలేరు ఆథమ్ జవాన్లకి అంకితం


మెగా, మహేష్ అభిమానులకి సంక్రాంతి ఓ పది రోజుల ముందే వచ్చింది. హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో #మెగాసూపర్ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఎల్భీ స్టేడియంలో ఘనంగా జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఫంక్షన్ ప్రారంభం అయింది. 

ఫంక్షన్ ప్రారంభానికి ముందు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ టీవీ ఛానల్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సరిలేరు పాటల్లో మీకు ఏ పాట అంటే ఇష్టం ? అని అడిగితే.. సరిలేరు ఆథమ్. ఆ పాటని జవాన్లకి అంకిస్తమిస్తున్నట్టు తెలిపారు. అన్నట్టు.. ఈ పాటని స్వయంగా దేవిశ్రీనే రాశారు. ఫారిన్ వెళ్లి ట్యూన్ కట్టారు. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా కనిపించే నేపథ్యంలో ఈ పాట వస్తుంది. రొమాలు నిక్కబొడిచేలా ఉన్నా.. ఈ పాట అభిమానులని అమితంగా ఆకట్టుకుంటోంది.