లైవ్ : సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్

2020 బోణి సూపర్ స్టార్ మహేష్ బాబుదే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది టాలీవుడ్ లో విడుదలవుతున్న తొలి స్టార్ హీరో సినిమా ఇదే. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నే అంతే భారీగా నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుతం సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఫంక్షన్ ప్రారంభం అయింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇప్పటికే అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. మహేష్ పాటలతో డ్యాన్సర్స్ స్టెప్పులేస్తున్నారు. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !