‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ టాక్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సరిలేరు ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరిలేరు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో అనిల్ రావిపూడి మార్క్ కనబడింది.

వినోదం, యాక్షన్, ఎమోషన్ కలగలిపిన సినిమా సరిలేరు అని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ మొదలవ్వడమే ఫన్ తో మొదలైంది. ట్రైయిన్ ఏపీసోడ్ లోని బిట్ సీన్స్ క్యూ కట్టాయి. కడుపుబ్బా నవ్వించారు. మహేష్, రస్మిక, సంగీత టైమింగ్ అదిరిపోయింది. బండ్ల గణేష్ బ్లేడ్ బాజ్జీగా కనిపించారు. ఇక యాక్షన్, ఎమోషన్ అదిరింది. మహేష్-విజయశాంతి కాంబోలో ఎమోషన్స్ సీన్స్ ఉండబోతున్నట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది.