చిరంజీవి-విజయశాంతిని కలిపిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని తిరిగి కలిపారు. చిరు-విజయశాంతిలది హిట్ కాంబో. వీరి కలయికలో ఏకంగా 20 సినిమాలొచ్చాయ్. బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో చిందేశారు. ఇప్పటికీ వీరి కలిసి వేసిన స్టెప్పులు ఎంతో ఫేమస్. అలాంటి వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయి. 

దానికి కారణం.. చిరంజీవి కంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లిన విజయశాంతి పలుమార్లు ఆయన్ని టార్గెట్ చేసింది. చిరుపై విమర్శలు చేసింది. దానికి చిరు నొచ్చుకున్నారు. చాన్నాళ్లుగా వీరి మధ్య మాటల్లేవ్. అసలు కలుసుకోలేదు. అలాంటి వీరిద్దరిని మహేష్ కలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. 

ఆదివారం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో జరిగిన సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకపై చిరు-విజయశాంతిల మధ్య ఆసక్తకర చర్చ జరిగింది. వీరిద్దరు తీపి జ్ఝాపకాలని నెమరు వేసుకొన్నారు. తనని ఎలా మాటలు అనాల్సి వచ్చిందని చిరు ప్రశ్నించారు. దానికి.. స్నేహం, వేరు రాజకీయాలువేరు. ఇప్పటికీ మీరు నా హీరో అన్నారు విజయశాంతి. మొత్తానికి చిరు-విజయశాంతి తిరిగి ఒక్కటయ్యారు. దానికి కారణం మహేష్ నే అంటూ.. ఆయనకి థ్యాంక్స్ చెప్పారు చిరు.