నయన్ పబ్లిక్’గానే.. ఆ పని చేసిన నయన్ !


స్టార్ హీరోయిన్ నయనతార జీవితంలో రెండు సార్లు మోసపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నిస్వయంగా ఆమెని తెలిపింది. తొలిసారి నటుడు శింబుతో ప్రేమలో పడింది. వీరిద్దరూ తెర మీద, తెర వెనక ఫుల్లుగా రొమాన్స్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. కొన్నాళ్లు ఒంటరి జీవితాన్ని గడిపిన.. అప్పటికే పెళ్లై, పిల్లలు ఉన్న నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాకి పడిపోయింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాన్నాళ్లు నడించింది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.

ఫైనల్ గా ప్రేయసి నయన్ ని వదిలేసిన ప్రభుదేవా పెళ్లాం దగ్గరికే వెళ్లిపోయారు. రెండో సారి ప్రేమలో ఓడిపోవడంతో నయన్ గుండె పగిలినట్టయింది. ఆ బాధలో ఉండగానే.. ఆమెకి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ పరిచయం అయ్యారు. ఆయనతోస్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఇక ఇటీవల కాలంలో వీరిద్దరు విడిపోయారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై జీ సినీ తమిళ అవార్డుల కార్యక్రమంలో నయన్ క్లారిటీ ఇచ్చింది. తన కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉందని అన్నారు. విఘ్నేశ్ శివన్ ప్రేమలో తాను చాలా సంతోషంగా ఉన్నానని..  ఆయన ప్రేమలో తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని తెలిపారు. దీంతో.. విఘ్నేశ్ శివన్ తో బ్రేకప్ వార్తలని పులిస్టాప్ పెట్టినట్టయింది.