మహేష్ కంటే బన్నీ షార్ప్


ఇది నేను చెప్పడం లేదు. సెన్సార్ బోర్డ్ చెప్పింది. అవునూ.. అనిల్ రాపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రషిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 49నిమిషాలు.

సరిలేరు రిలీజైన తర్వాత రోజే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 45నిమిషాలు.

ఈ రెండు సినిమాలు వినోదమే ప్రధానంగా తెరకెక్కినవి. సరిలేరులో మహేష్ మేజర్ ఆర్మీ అజయ్  కృష్ణ ప్రాత్రలో కనిపించినా.. అది కొద్దిసేపే. సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ ఉంటుంది. ఇక అల.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఐతే.. ఈ రెండు సినిమాల్లో అల.. రన్ టైం సరిలేరు కంటే ఓ 4 నాలుగు నిమిషాలు తక్కువ. ఈ నేపథ్యంలోనే మహేష్ కంటే బన్నీ షార్ప్ అంటూ సరదాగా చెప్పుకొంటున్నారు.