ధనుష్ ‘పటాస్’ ట్రైలర్.. చూశారా ? 

తమిళ్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘పటాస్’. తెలుగులో ‘రుస్తుం’గా రానుంది. ఈ చిత్రానికి ఆర్. ఐ దురై సెంతిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ధనుష్ కి జంటగా మెహ్రీన్ నటించింది. సీనియర్ హీరోయిన్ స్నేహ, యువ నటుడు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో ధనుష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. కిక్కు బాక్స్ బిట్ సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. కామెడీ, వినోదం, యాక్షన్ బిట్ సీన్స్ తో పటాస్ ట్రైలర్ ని కట్ చేశారు. ఈ ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !