జేఎన్‌యూకు వెళ్లిన దీపికకు.. కష్టాలు మొదలు !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మంగళవారం సాయంత్రం సడెన్ గా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్లింది. ఇటీవల దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులని ఆమె పరామర్శించింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్‌తో పాటు ఆమె పలువురిని దీపికా కలిసింది. వర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు సంఘీభావం తెలిపింది.

దీపిక జేఎన్ యూకు వెళ్లడం ఆమె అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. యూనివర్సీటీకి ఎందుకు వెళ్లావ్ ? అంటూ దీపికని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఆమె తాజా చిత్రం ఛపాక్. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 10న ఛపాక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఛపాక్ ని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  ‘బాయ్‌కట్ ఛపాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.