అస్వస్థకి గురైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని పలువురు తెరాస నేతలు పరామర్శిస్తున్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరామర్శించారు. దానికి సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం బయటికొచ్చింది.

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అసలు ఏమైంది ? ఏ ఆస్పత్రిలో చేరారు ?? అని ఆయన అభిమానులు, తెరాస కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా జగదీశ్వర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకి గురయ్యారా.. ? లేదా ఏదైనా సీరియస్ ఇష్యూనా.. ?? అన్నది తెలియాల్సి ఉంది.