కారెక్కిన పీసీసీ నేత 

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కి గట్టి షాక్ తగిలింది. టీపీసీసీ కార్యదర్శి బట్టి జగపతి పార్టీకి రాజీనామా చేసి గులాబీ కారెక్కారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో తన అనుచరులతో కలిసి జగపతి టిఆర్ఎస్’లో చేరారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బట్టి ఉదయ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గోదల సాయిరాం తదితరులు జగపతితో కలిసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అసలే అంతర్తత విబేధాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక జగపతి పార్టీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. కేసీఆర్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ పథకాలను పొగుడుతుంటే ఇక్కడి నేతలు ఎన్నికల ప్రయోజనం కోసం విమర్శిస్తున్నారని అన్నారు హరీశ్.