మహేష్’కు రాజధాని సెగ

ఏపీ రాజధాని సెగ సినీ స్టార్స్ కి తాకింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి తెదేపా, జనసేన పార్టీలు, పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రాజధాని కోసం పోరాటం చేస్తున్న జై ఆంధ్రప్రదేశ్‌, యువజన పోరాట సమితి నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు సినీ నటుల నివాసాల ఎదుట దీక్ష చేయాలని ఈ రెండు సంఘాలు నిర్ణయించాయి. 

ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు నివాసం ఎదుట కొంతమంది నిరాహార దీక్ష చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్‌, యువజన పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ నటులు రాజధానిపై స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. మరీ.. మహేష్ ఏపీ రాజధాని అంశంపై స్పందిస్తారా ? అన్నది చూడాలి. 

ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు రాత్రి నుంచే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి సినిమాలకి ఆరు షోస్ వేసుకొనేలా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.