చక్రపాణికి పితృవియోగం

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణికి పితృవియోగం జరిగింది. చక్రపాణి తండ్రి ఘంటా మొగులయ్య(89) కన్నుమూశారు.మొగులయ్య మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ… గత వారం రోజులుగా నీమ్స్ లో చికిత్సపొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. పలువురు రాజకీయ ప్రముఖులు చక్రపాణిని కలిసి సంతాపం తెలిపారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి, రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు, టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు విఠల్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌, పలువురు ప్రభుత్వ అధికారులు మొగలయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.