కేంద్రం జోక్యం కోరిన పవన్ 

ఏపీ రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గత కొన్నాళ్లుగా రాజధాని అంశంతో ఏపీ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. రాజధాని రైతులు ఆందోళనలని కొనసాగిస్తున్నారు. వారికి తెదేపా, జనసేన నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల అరెస్టులు, లాఠీ ఛార్జ్ లతో అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తలు కొనసాగుతోంది. రాజధానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఏపీలో ర్యాలీలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. పెద్దన్న పాత్రని పోషించాలని పవన్ కోరారు. శుక్రవారం పవన్ గుంటూరు జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో భాజాపా, కాంగ్రెస్ పార్టీలు వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రాష్ట్రం కూడా భూములిచ్చిన రైతులతో చర్చించాకే నిర్ణయం రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్దారు.