కోట్లు ఆఫర్ చేసినా.. ఆ పని చేయలేదు : అల్లు అర్జున్

జులాయి, సన్నాఫ్  సత్యమూర్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి12) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హిట్ల తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. గతంలో స్టేజ్ షో నిర్వాహకులు రూ. కోట్లలో పారితోషికం ఆఫర్ చేశారు. కానీ నాకు వాటిపై ఆసక్తి లేదు. అందుకే ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు.

అల వైకుంఠపురములో మ్యూజిక్ ఫెస్టివల్ లో డ్యాన్స్ చేయడంపై స్పందిస్తూ.. వేదికపై నాకు తెలియకుండానే డ్యాన్స్ చేసేశాను. నేను ముందుగానే  దీన్ని  ప్లాన్ చేసుకోలేదు. అంతేకాదు అంత సేపు వేదికపై ప్రసంగిస్తానని కూడా అనుకోలేదు. అలా జరిగిపోయిందని బన్నీ చెప్పుకొచ్చారు.