ఏపీకి మూడు రాజధానుల ప్రకటన..ఈ నెల 18నే !

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. జీన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై అధ్యయం చేసేందుకు ప్రభుత్వం హైపర్ కమిటీని ఏర్పాటు చేసింది. హైపర్ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశమై చర్చించింది. జీఎన్ రావు, బీసీజీ కమిటీలు సిఫార్స్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకి హైపర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఏపీ కేబినేట్ సమావేశం కానుంది. ఈలోపే హైపర్ కమిటీ నివేదికని ప్రభుత్వానికి అందజేయనుంది. కబినేట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై ప్రధానంగా చర్చించనున్నారు. కమిటీ నివేదిక అమలు, తదుపరి చర్యలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు స్పష్టమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.