దేవిశ్రీ నెగ్గాడు.. !

సంక్రాంతి సినిమాల విషయంలో అందరి కంటే ఎక్కువ ఒత్తిడి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై పడింది. ఎందుకంటే.. ? ముందుగా వచ్చేసిన ‘అల.. వైకుంఠపురంలో’ పాటలు అద్భుతంగా ఉన్నాయి. రికార్డులని బద్దలుకొట్టాయి. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలుగు పాటలుగా రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో సరిలేరుకు సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీపై ఆ ఒత్తిడి పడింది. ఈ రెండు సినిమాల పాటలని పోల్చీ చూశారు జనాలు. ఈ పోటీలో థమన్ దే పై చేయి. 

ఐతే, తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ పై చేయి సాధించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ప్రత్యేకంగా దేవిశ్రీ అందించిన పాటల గురించి మాట్లాడుకుంటున్నారు. కథకి తగ్గట్టుగా పాటలు ఇచ్చారు. తెరపై పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతంలో దేవి అదరగొట్టేశాడు. ఆర్మీ సీన్స్ లో దేవి ఇచ్చిన నేపథ్య సంగీతం రొమాలు నిక్కబొడిచేలా ఉంది. ఈ నేపథ్యంలోనే దేవి ఒత్తిడి జయించాడు. నెగ్గాడని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు.. ఒత్తిడి థమన్ పైనే. అల.. పాటలు బాగున్నాయ్. ఆ రేంజ్ లో నేపథ్య సంగీతం కూడా ఉంటే థమన్ కూడా నెగ్గినట్టే. సంక్రాంతికి దేవి, థమన్ ఇద్దరి గెలిచారని అప్పుడు హ్యాపీగా చెప్పుకోవచ్చు.