సితార ఛానెల్’కు రస్మిక స్పెషల్ ఇంటర్వ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఎ&స్ పేరిట ఓ యూట్యూబ్ ఛానలె ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఛానెల్ సినిమా ప్రమోషన్స్ లోకి దిగింది. అవునూ.. సరిలేరు నీకెవ్వరు సినిమాని ప్రమోట్ చేసింది. హీరోయిన్ రష్మిక మందనని ఇంటర్య్వూ చేశారు. ఇంటర్వ్యూలో ఆద్య, సితారల మధ్య కూర్చున్న రస్మిక చిన్న పిల్లలా మారిపోయింది. వారితో కలిసి అల్లరి చేసింది. పిల్లలిద్దరు ముద్దుముద్దుగా అడిగిన ప్రశ్నలకి అంతే ముద్దుగా సమాధానం చెప్పింది.

ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. వినోదం, ఎమోషన్ పడింది. చాన్నాళ్ల తర్వాత మహేష్ నుంచి మాస్ ఎంటర్ టైనర్ వచ్చిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ కూతురు సితార భాగస్వామ్యం కావడం.. అభిమానులని ఆకట్టుకుంటోంది. సితార-రస్మిక-ఆధ్యల ముచ్చట్లని మీరు వినేసేయండీ.. !