పైరసీపై పోరాటం మొదలెట్టిన మహేష్

సంక్రాంతి సినిమాలకి పైరసీ భయం పట్టుకుంది. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్భార్’ చిత్రం అప్పుడే ఆన్ లైన్ లో దర్శినమిస్తోంది. దర్భార్ క్వాలిటీ ప్రింట్ లీక్ కావడం.. భారీగా డ్యామేజ్ జరగనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అప్రమత్తమయింది. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ రంగంలోకి దిగారు.

నో టు పైరసీ అంటూ మహేష్ సరిలేరు పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పైరసీ లింకులు ఏమైనా కట్టబడితే..
sarileruantipiracy@gmail.com మెయిల్ చేయాలని సూచించారు. వాటిని వెంట వెంటనే డిలీట్ చేసే ఏర్పాట్లని సరిలేరు చిత్రబృందం చేసింది. అసలే.. సంక్రాంతి రేసులో మూడ్నాలుగు సినిమాలున్నాయి. అందులోనూ మహేష్, అల్లు అర్జున్ సినిమాలు ఒకరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా పైరసీ అయితే.. భారీ నష్టం జరగనుంది. ఈ నేపథ్యంలో సరిలేరు చిత్రబృందం పైరసీ పట్ల అప్రమత్తమైంది.

ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు హిట్ టాక్ సొంతం చేసుకొంది. చాన్నాళ్ల తర్వాత మహేష్ నుంచి మంచి మాస్ ఎంటర్ టైనర్ వచ్చిందని ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ మహేష్ రీఎంట్రీతోనూ అదరొట్టేసింది. వినోదం, ఎమోషన్ పండిన సరిలేరు అసలు సిసలు సంక్రాంతి సినిమాగా నిలవనుందని చెప్పుకొంటున్నారు.