పొలం దున్నిన మంత్రి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. మంత్రులకి సీఎం కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేశారు. టార్గెట్ మిస్సయితే.. మంత్రి పదవులు ఊడుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రులపై ప్రెజన్ ఉంది. ఐతే, ఆ ప్రెజన్ ని పక్కనపెట్టేసి.. పొలం పనుల్లో బిజీగా గడిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ఆదివారం తన సొంత పొలానికి వెళ్లి ట్రాక్టరుతో పొలం దున్నారు. 

వరంగల్ రూరల్ జిల్లా పర్వగిరిలో ఉన్న పొలంలో కాసేపు స్వేదం చిందించారు ఎర్రబెల్లి. ఎంత స్థాయికి వెళ్లినా అన్నం పెట్టిన భూమిని మర్చిపోకూడదన్న ఆయన… ఆ తర్వాత అదే గ్రామంలో కాసేపు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ద్యం, డ్రైనేజ్ పనుల గురించి ఆరా తీశారు. అనంతరం పొలం దగ్గరికి వెళ్లి వ్యవసాయం చేశారు. దయాకరన్న పొలం దున్నుతున్న ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.