అభిమానులకి థ్యాంక్స్ చెప్పిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరుని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సరిలేరు చిత్రబృందం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం సరిలేరు చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

“అభిమానులకి థ్యాంక్స్ జనవరి 11నే సంక్రాంతి పండగ మాకు ఇచ్చారు. సినిమా రిలీజ్ రోజు నా పిల్లలతో చూడడం నాకు సెంటిమెంట్. విజయశాంతి గారి పాత్ర ఆవిడ తప్ప ఎవరు చేయలేరు. F2 టైమ్ లో అనిల్ గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్మెంట్ ఫీల్ అయ్యాను. ఆ సినిమా చూశాక ఈ కథ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనిపించింది. చేసేశారు. నా పెర్ఫార్మెన్స్ కి అభిమానుల నుంచి వస్తున్న కామెంట్స్ ఆనందంగా ఉంది. దేవి నా ఫేవరేట్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకి BGM చాలా ఇంపార్టెంట్. అల్లూరి సీతారామరాజు ట్రాక్ కి దేవి ఇచ్చిన స్కోర్ కి గూస్ బంప్స్ వచ్చాయి” అన్నారు మహేష్.