ఎస్వీబీసీ ఉద్యోగినితో 30ఇయర్స్ పృధ్వీ రాసలీలలు.. ఆడియో టేప్ లీకు !

నటుడు 30 ఇయర్స్ పృధ్వీ కొత్త వివాదంలో ఇరుకొన్నాడు. పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఎస్వీబీసీ ఉద్యోగినులతో పృధ్వీ రాసలీలలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఓ మహిళతో పృధ్వీ సాగించిన రొమాంటిక్ సంభాషణకి సంబంధించిన ఆడియో టేపు లీకైంది. ఇందులో ‘నువ్వంటే ఇష్టం, గుండెల్లో ఉన్నావ్.. ఐ లవ్ యూ’ ఎస్వీబీసీ ఉద్యోగితో పృధ్వీ మాట్లాడం వినోచ్చు. 

అంతేకాదు.. యేడాదిగా మద్యం తాగడం మానేశాను. మళ్లీ తాగితే నీ ముందే తాగుతా. ఐ లవ్ వ్యూ.. అంటూ పృధ్వీ ప్రమోజ్ చేయడం చూడొచ్చు. సదరు మహిళా కూడా పృధ్వీతో అంటే రొమాంటిక్ గా మాట్లాడింది. ఐతే, వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆడియో టేపుని సదరు మహిళా తాజాగా బయటికొచ్చింది. ఇక పృధ్వీ ఎస్వీబీసీ ఛానెల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కొత్తగా 33 మంది ని తీసుకున్నారని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తానని.. వారిని లొంగదీసుకుంటున్నట్టు టాక్.

బ్రహ్మోత్సవాలలో మహిళలు నృత్యం చేస్తున్నట్టు ప్రోమో చేయించాడు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ లేదు. ఇటీవలే రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పృధ్వీ. ఆయన మాటలని వైసీపీ నేతలే విమర్శించారు. తాజాగా, పృధ్వీకి సంబంధించిన రాసలీల ఆడియో టేపు బయటికొచ్చింది. ఇలాంటి ఆడియో టేపులు.. ఇంకా చాలా బయటికిరాబోతున్నట్టు సమాచారమ్.