ధావన్ దంచాడు.. కానీ !

టీమిండియా బౌలర్లపై భారం పడింది. ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో మొదటి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కష్టాల్లో పడింది. 45ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ప్రస్తుతం షమీ (2), కులదీప్ (2) క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసే బాధ్యత బౌలర్లపై పడింది.

అంతకుముందు ధావన్ 74 (91బంతుల్లో), కె.ఎల్ రాహుల్ 47 (61 బంతుల్లో) రాణించారు. రోహిత్ శర్మ 10, కోహ్లీ 16 విఫలమయ్యారు. పంత్ 28, జడేజా 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ చేయలేకపోయారు. రోహిత్, కోహ్లీలలో ఎవరో  ఒకరు రాణించలేని లోటు స్పష్టంగా కనిపించింది.