సరిలేరు సెంచరీ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు సెంచరీ పూర్తి చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ. 100కోట్లు క్రాస్ చేసింది. రూ. 103కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం స్పెషల్ పోస్టర్ ని వదిలింది.

చాన్నాళ్ల తర్వాత మహేష్ చేసిన మాస్ ఎంటర్ టైనర్ ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. వినోదం, ఎమోషన్ పండిన సరిలేరు నీకెవ్వరు మహేష్ అభిమానులని మురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. దాదాపు 13 యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. వచ్చింది గ్యాప్ మాత్రమే ఇప్పటికీ తనలో ఆ ఫైర్ తగ్గలేదని విజయశాంతి నిరూపించారు.