రాజ్ కోట్ వన్డేలో భారత్ విజయం

రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ గెలుపొందింది. 36 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.1ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాట్స్ మెన్స్ లలో  స్మిత్(98, 102 బంతుల్లో)‌, లబుషేన్‌( 46, 47బంతుల్లో) రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో  షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీలు తలా 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్.. శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ని టీమిండియా 1-1 సమం చేసింది. ఆఖరి వన్డే ఆదివారం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.