‘డిస్కోరాజా’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అప్ డేట్స్

మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజాగా మారిన సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాశా, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. బాబీ సింహా విలన్‌ పాత్రలో నటీంచారు. థమన్ సంగీతం అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. ఈ నెల 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అంతకంటే ముందు డిస్కోరాజా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు (నవంబర్ 19) హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో డిస్లోరాజా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.