సంక్రాంతి విజేత ఎవరు ?

సంక్రాంతి సీజన్ ముగిసింది. సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో మూడు స్ట్రయిట్ సినిమాలు. సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో, ఎంత మంచివాడవురా. ఒకటి డబ్బింగ్ సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్భార్. ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి విజేతగా నిలిచింది ఎవరు అంటే.. ? ఏమాత్రం తడుముకోకుండా అల్లు అర్జున్ పేరు చెబుతున్నారు.

డబ్బింగ్ సినిమా కాబట్టి దర్భార్ ని పట్టించుకోనక్కర్లేదు. మిగిలిన మూడు సినిమాల్లో కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలింది ఇద్దరు స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్ మాత్రమే. జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి. 

10రోజుల్లోనే రూ. 100కోట్లపైగా షేర్ ని రాబట్టింది. నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. కానీ, అంతకంటే.. ఎక్కువ కలెక్షన్స్ అల.. సాధిస్తోంది. అల.. వైకుంఠపురంలో కేవలం ఆరు రోజుల్లోనే వందకోట్ల షేర్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 3మిలియన్ మార్క్ క్లబ్ లో చేరిపోయింది. అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాల్లో చేరింది. ప్రేక్షకుల స్పందన, కలెక్షన్స్ ని పరిగణలోనికి తీసుకున్న సంక్రాంతి విజేత అల్లు అర్జున్ నే అంటున్నారు అభిమానులు.