బ్రేకింగ్ : ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లుని ఏపీ శాసన మండలిలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే డొక్కా రాజీనామా చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. మండలిలో వైకాపాకి సరైన బలం లేదు. మొత్తం 58 ఎమ్మెల్సీలు ఉన్న మండలిలో తెదేపా 28మంది, వైకాపా 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

ఈ నేపథ్యంలో డొక్కా రాజీనామా చేయడంతో.. ఇప్పుడే నెంబర్ గేమ్ మొదలైనట్టు అనిపిస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న డొక్కా, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు. ఇక ఆయన టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు. డొక్కా దారిలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారమ్.