జాను తొలి పాట వచ్చేసింది

శర్వానంద్-సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాట ‘ప్రాణం.. ‘ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాటని శ్రీమణి రాశారు. చిన్మయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ కలిసి పాడారు. హృదయాన్ని హత్తుకునేలా ప్రాణం పాట సాగింది.

తమిళ చిత్రం ’96’. 2000 దశాబ్ధంలోనే బెస్ట్ ప్రేమకథా చిత్రంగా నిలిచింది. ఆ మేజిక్ ని ‘జాను’ రిపీట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. కథని ఏమాత్రం మార్చకుండా.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు మాత్రమే చేసినట్టు తెలుస్తోంది. మంచి కథపడితే.. సమంత, శర్వా ఇద్దరు జీవించేస్తారు. ‘జాను’లోనూ వీరి నటన హైలైట్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన టీజర్ ని చూస్తే అర్థమవుతోంది. ఫిబ్రవరిలో జాను ప్రేక్షకుల ముందుకు రానుంది.