10రోజులు.. రూ. 101.97కోట్లు !

సూపర్ స్టార్ మహేష్ బాబు పండగ పూట అభిమానులని మురిపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రేంజ్ లోనే కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా పదిరోజుల్లోనే రూ. 101.97కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక నైజాంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరిలేరు రికార్డ్ సృష్టించింది. ఒక్క నైజాంలోనే సరిలేరు రూ.33 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

చాన్నాళ్ల తర్వాత మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ని పండగ పూట మహేష్ అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వినోదం, యాక్షన్, ఎమోషన్ పండిన సరిలేరుని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు. అనిల్ రావిపూడి మార్క్ వినోదం బాగా పండింది. ఇప్పట్లో సరిలేరు కలెక్షన్స్ హవా ఆగేలా లేదు. బహుశా.. రూ. 150 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక, మరో రెండు నెలలు గ్యాప్ తీసుకొన్న తర్వాత మహేష్ వంశీపైడిపల్లి చిత్రంలో మరో సినిమా చేయబోతున్నారు.