‘అశ్వద్ధామ’ ట్రైలర్ టాక్


యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై సినిమాలు చేస్తున్నారు. నాగశౌర్య తొలిసారి రచయితగా కూడా మారాడు. ఆయన తాజా చిత్రం ‘అశ్వద్ధామ’ కథని అందించారు. విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే ఓ థ్రిల్లర్ కథతో అశ్వద్థామ తెరకెక్కింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈ నెల 31న అశ్వద్థామ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో కట్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది. ‘రాక్షసుడిని, భగవంతుడిని చూసిన కళ్లు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. విశాఖ బీచ్ లో అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీని నాగశౌర్య తెలుసుకొనే క్రమంలో ఎదురైన సవాళ్లు కథాంశంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఘోరాలు, వారిని ఎదురించే క్రమంలో హీరో చేసే యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బలంగా ఉన్నట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. మొత్తానికి అశ్వద్థామ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలని పెంచేలా ఉంది.

ఇక ఈ సినిమా కోసం ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు పాటలని శ్రీచరణ్ పాకాల అందించారు. నేపథ్య సంగీతం మాత్రం జిబ్రాన్ అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథలని నేపథ్య సంగీతం చాలా కీలకం. ఈ సినిమా జిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది.