ఇందిరాపై కంగనా ఫైర్


నిర్భయ దోషులని క్షమించాలని, వారికి క్షమాభిక్ష పెట్టాలని, ఈ విషయంలో సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని లాయ‌ర్ ఇందిరా జైసింగ్ నిర్భాయ తల్లి ఆశాదేవిని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆశాదేవి సీరియస్ అయింది. అలా ఎలా అడుగుతారని, అసలు తనని అడగటానికి ఇందిరా ఎవరని ఆశాదేవి ప్రశ్నించారు. ఆశాదేవి సమాధానానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు.

ఈ జాబితాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రౌన‌త్ కూడా చేరారు. ఆమె లాయర్ ఇందిరాపై ఫైర్ అయ్యారు. ఇందిరని కూడా నిందితుల‌తో క‌లిపి నాలుగు రోజుల పాటు జైలులో బంధించాల‌న్నారు. వారితో ఇందిరని బంధించ‌డం అవ‌స‌ర‌మ‌ని, అప్పుడే ఆమెకు వాళ్లేంటో తెలుస్తుంద‌న్నారు. అలాంటి మ‌హిళ‌లే ఇలాంటి రాక్ష‌సులు, నేర‌గాళ్ల‌కు జ‌న్మ‌నిస్తార‌ని కంగానా ఆరోపించారు.