రస్మికకి రూ.250కోట్ల ఆస్తి.. ఎలా సంపాదించింది !

యంగ్ హీరోయిన్ రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. బాగా సంపాదిస్తోంది. రస్మిక అరడజను సినిమాలు చేసి ఉంటుందేమో. అప్పుడే రూ. 250కోట్లు సంపాదించడట. కన్నడ మీడియానే రస్మిక సంపాదన ఇంత అని బయటపెట్టింది. రస్మిక ఐటీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె సంపాదన ఈ రేంజ్ లో ఉందంటూ కథనాలు ప్రచురించింది. దీంతో రస్మిక సంపాదన టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అంత సంపాదన రస్మిక.. ఎలా సంపాదించింది ? అంటూ చర్చించుకుంటున్నారు.

క‌న్న‌డ సినిమా ‘కిరిక్ పార్టీ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డియర్ కామ్రెడ్ లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఏకంగా సూపర్ స్టార్ మహెష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ మరింత దగ్గరైంది రస్మిక. 

ఐతే, స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలోనే రస్మిక రూ. 250కోట్లు వెనకేయడం ఏంటీ ? అని చెప్పుకొంటున్నారు. ఇంత డబ్బు ఎలా వచ్చింది ? అని మాట్లాడుకుంటున్నారు. రస్మిక దగ్గర రూ. 250కోట్లు ఉన్న మాట నిజమేనా ? అంటే.. అది కన్నడ మీడియా కథనాలు మాత్రమే. నిజం కావాల్సిన పనిలేదేమో. ఒకవేళ నిజమే అయితే.. రస్మిక సంపాదనలో క్వీన్ అన్నమాట.