థ్యాంక్స్ చెప్పిన సునీల్

కమెడియన్ సునీల్ అభిమానులకి థ్యాంక్స్ చెప్పారు. సునీల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.  సైనస్, ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ మాధాపూర్ లోన్ని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా సునీల్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఇప్పుడు కాస్త రిలీఫ్ గా ఉందని తెలిపారు. అంతేకాదు.. తన ఆరోగ్య పరిస్థితిపై ఆలోచించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ సునీల్ ట్విట్ చేశారు.అంతేకాదు.. రేపు రిలీజ్ కాబోతున్న డిస్కోరాజాని చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.

ఈ ఉదయం సునీల్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ అనే ప్రచారం జరిగింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతలో సునీల్ స్వయంగా స్పందించారు. తాను  ఆరోగ్యంగానే  ఉన్నా. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని  వెల్లడించాడు. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో  చేరానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సునీల్ కోరారు. ఇప్పుడు బెటర్ గా  ఉందని.. తన మంచి కోసం ఆలోచించిన అభిమానులకి థ్యాంక్స్ అంటూ సునీల్ ట్విట్ చేశారు.